కర్మ సిధ్ధాంతం

గురుత్వాకర్షణ సిధ్ధాంతం అనేది ఎక్కడో ఒక ఆపిల్ పండు పడితేనే గానీ లేదా ఎవడో చెప్తేనే గానీ మనకు తెలియలేదు అనే అజ్ఞానపు మూర్ఖత్వం లాగానే
కర్మ సిధ్ధాంతం అనేది నేను నమ్ముతాను నేను నమ్మను నేను నమ్మనిది అసలు ఉండదు ఉండలేదు ఉండబోదు అని ఆలోచించే అజ్ఞాన మూర్ఖత్వానికి పరాకాష్ట
కనబడని ప్రాణవాయువు ద్వారా నీ గుండె గమనం అన్నది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎంత నిజమో ప్రాణం పోయాక ఏ ప్రాణ వాయువూ నీ గుండెని ఎలాగ కొట్టుకునేలా చేయలేదో అన్న విషయం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎంత నిజమో కర్మ సిధ్ధాంతం పై జరిగే R&D మనము నేర్చుకునే పాటించే ఈ కర్మాచరణ, కర్మ ఫల ప్రాప్తి, నిష్కామకర్మ, కర్మ నివృత్తి, కర్మ శేషమ్, క్రియా యోగం వంటివి అంతే నిజం.
జన్మకి కారణం కర్మ.
జన్మ మరణ చట్రానికి (Loop) కారణం కర్మ.
సుఖదుఖ కర్మాచరణలకు, జీవి యొక్క కర్మఫల భోగభాగ్యాలకు కారణం కర్మ.
కర్మ నిశ్శేషమే మోక్షం.
కర్మ లేదా కర్మ సిధ్ధాంతం అన్నవి అర్ధం చేసుకోవడం ఎంత సులభమో అంతే COMPLEX.
ఈ కర్మ జనితమైన జనన మరణ మాయా నిర్మితమైన పరమాత్మ సృష్టిని దాటడం కూడా ఎంత సులభమో అంతే COMPLEX.
కొన్ని కోట్ల జన్మల సంచిత కర్మ రాశి ఎంత ఉందో ఇంకా ఎన్ని కోట్ల జన్మల ఫలానుభవం మిగిలి ఉందో అర్ధం కావాలంటే ఈ చిన్న Trial చేసిన తెలుస్తుంది.
కళ్ళు మూసుకుని ఆలోచనా రహితంగా ఎలాగ ఉండలేమో ఆయా ఆలోచనలు మన కర్మరాశికి positive మరియూ negative balance add చేస్తూ జీవి అనుభవించాల్సిన కర్మరాశిని పెంచుతూ ఉన్నాయి. అలాంటిది ఇక మన మూర్ఖత్వంతో ప్రతీ రోజూ ప్రతీ క్షణం చేస్తూన్న కర్మ క్రియలను ఎలాగ గణిoచగలము.
భక్తి యోగం క్రియా యోగం జ్ఞాన యోగం కర్మ యోగం వంటి అనేక యోగాలలో ఏ ఒక్క దానిద్వారానైనా పరిపూర్ణత సాధించిన మోక్షప్రాప్తి సంప్రాప్తిస్తుంది.
*** --- *** --- ***
నిష్కామ కర్మ అన్నది ఎంతో జ్ఞానంతో గానీ పరిపక్వతతో గానీ అర్ధం కాదు ఆచరణకి అంతు బట్టదు. చేసే లేదా చేస్తున్న కర్మ ఫలప్రాప్తికి తన చిత్తం అంటకుండా చేసేదే నిష్కామకర్మ. కృష్ణార్పణం అనేది దానికీ ఒక simple solution. చేస్తున్న చేసిన కర్మ జీవునికి అంటకుండా చేసే ప్రక్రియ. కర్మ మరియూ కర్మ బంధనమే జీవునికి పునర్జన్మ హేతువు.
సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలు అని మూడు విధాలు.
సంచిత - ఎన్నో కోట్ల జన్మలలో చేసి పోగు చేసుకున్న కర్మ ఫలితం .
ప్రారబ్ధ - ఈ జన్మలో అనుభవించదగిన కర్మ ఫలితం.
ఆగామి - ఈ జన్మ కర్మ ఫలితం ద్వారా మిగిలే Total Balance Left Out.
NOTE: నిష్కామ, క్రియా యోగ తదితర పద్దతుల ద్వారా Zero out చేసుకోవచ్చు.
మన ఋషులు "ప్రారబ్ద కర్మ" ను మూడు విధాలుగా
విభజించారు .......
1. ధృతకర్మ 2. ధృతాధృత కర్మ 3. అధృత కర్మ అని.
పూర్వజన్మలో మన్నించడానికి ఏ మాత్రం
వీలులేని ఘోర తప్పిదం చేసినవాళ్ళు -
"ధృత కర్మ" విభాగంలోకి వస్తారు ....
ఒకరిని హత్యచేయటం, మోసం చేయటం వంటివన్నీ ఈ భాగంలోనే వస్తాయి.
వీళ్ళు ఆ తప్పుకు శిక్షను అనుభవింల్సిందే ఎంత శాంతి చేసినా ఏమి ఫలితం ఉండదు,
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ధృతాధృత కర్మ. అనగా క్రిందటి జన్మలో చేసిన తప్పు క్షమించబడటానికి వీలున్నది, అంటే బొంబాయికి టిక్కెట్టు కొనుక్కుని ప్రయాణీకుడు పొరపాటున ఢిల్లీ వెళ్ళే రైలు ఎక్కి, TCకి అది పొరపాటున జరిగినదని చెప్పటంతో అతను జరిగిన తప్పు ఒప్పుకొని ప్రయాణీకుడికి జరిమానా వేయకుండా వదిలి వేయటం .......
•••••••••••••••••••••••••••••••••••••••••••••••
ఇక మూడవది అధృత కర్మ. పూర్వజన్మలో చేసిన చాలా చిన్న పొరపాటు చేసినవ్యక్తికి సంప్రాప్తించేది, మనస్సులోకి ఏదో చిన్న చెడు తలంపు ప్రవేశిస్తుందే కానీ కార్య రూపంలోకి వెళ్ళదు. ఉదాహరణకి మీ ప్రక్కఇంట్లో మీకు నచ్చిన ఒక వస్తువు ఉందనుకోండి. దాన్ని "దొంగిలిస్తే" అనే ఆలోచన మీకు రావచ్చు కానీ మీరు దొంగిలించలేదు. ప్రక్క ఇంటికి వెళ్లారు ఆ వస్తువు మీద చెయ్యి కూడా వేయబోయారు, అంతలో ఎవరో రావటం కనిపెట్టి ఆ క్షణమే తప్పు గ్రహించి చెడు తలంపును ప్రక్కకు నెట్టే వారు. పూర్వజన్మలో మీరు తలబెట్టిన చిన్న తప్పుకి ఈ జన్మలో చిన్న శాంతిచేసి ఆ చెడు తలంపు వల్ల మిమ్మల్ని అంటిన ఆ పాపాన్ని కడుక్కోగల్గుతారు ........
````````````````````````````````````````````````````
కాబట్టి మొదటి విభాగంలోని వాళ్ళు తప్ప మిగిలిన రెండు విభాగాల్లోని వాళ్ళు శాంతి, గ్రహశాంతి చేయించటం వాళ్ళకు ఈ జన్మలో మేలు చేస్తుంది అంతే కాకుండా రాబోయే జన్మలో అది బ్యాంక్ బాలెన్స్గా మిగులుతుంది కూడా అందుకే జ్యోతిష్కులు శాంతి చేయించండని సలహాలిస్తుంటారు.
..... .........
కర్మ సిధ్ధాంతానికి స్వయానా పరమాత్మ కూడా లోబడి ఉంటాడు దాటలేరు అనే చిన్న ఉదాహరణ మనకోసం.
ఒకసారి శ్రీకృష్ణుడి కొడుకు సాంబుడు అతని స్నేహితులు ఆడుకుంటూ అటుగా వచ్చిన మహర్షులని చూసి ఆటప్పటిద్దాం అనుకున్నారు.
కడుపు వచ్చినట్లు నటించి మహర్షులు రాగానే "అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా" అని అడిగారు. నిజం గ్రహించిన మహర్షులు ఆగ్రహించి మీవంశాన్ని నిర్మూలించే ముసలం పుడుతుంది అని శపించి శ్రీకృష్ణుడిని దర్శించి వెళ్లిపోయారు..
సాంబుడు సహా ఇతర కుమారులంతా వచ్చి శ్రీకృష్ణుడి దగ్గర మొరపెట్టుకుంటే "అది మహర్షుల శాపం. దానికి తిరుగులేదు. నేను తిప్పలేను" మహాత్ములని అవమానించిన ఫలితం అనుభవించండి అని వదిలేశాడు.
కాలక్రమంలో వంశ నాశనం అయింది. మహాభారత యుద్ధం ముగిసింది. యాదవులు అహంకారంతో విర్రవీగుతున్నారు. తనమన బేధాలు మర్చిపోయారు. అది ఏ స్థాయికి వెళ్లిందంటే శ్రీకృష్ణుడి ఎదురుగానే తాగడం, మాంసాహారం తినడం , బూతులు మాట్లాడడం, శ్రీకృష్ణుడిని సైతం అవమానించేలా ప్రవర్తించడం చేశారు. అయన ముందే గొడవలు కొట్లాటలు అబ్బో ఇది అది అనికాదు. సకల దుర్గుణాల నిలయం అయ్యారు. ఒకరోజు యదవులందరూ అందరూ కలిసి విహారయాత్రకని వెళ్లారు సముద్రతీరానికి వెళ్లారు. తప్పతాగి మైకంలో ఒకరినొకరు దర్బలతో కొట్టుకొని చచ్చిపోయారు. అలా వంశనిర్మూలనం జరిగిపోయింది.
అనంతరం శ్రీకృష్ణుడు దేహం చాలించాడు. ద్వారకా నగరం కొద్దిసేపట్లో మునిగిపోతుందనగా అర్జునుడు మిగిలిన యాదవ స్త్రీలని శ్రీకృష్ణుడి భార్యల్ని తీసుకొని ఒడ్డుకి చేరుకున్నాడు. ద్వారకనగరం మునిగిపోయింది. ఇంతలో అక్కడికి అతి భయంకరులైన బోయలు కిరతులు వచ్చి కనిపించిన ఆడవాళ్ళని ఎత్తుకుపోయారు. కొందరిని చంపేశారు. శ్రీకృష్ణుడి భార్యల్ని సైతం వదలలేదు. ఎత్తుకుపోయారు. లక్షలాది శత్రువుని అవలీలగా జయించిన అర్జునుడు కిరాతులని ఏమి చేయలేక మిన్నకుండిపోయాడు. కళ్ళముందే ఎత్తుకుపోతుంటే నిష్చేష్టుడై పోయాడు..
కృష్ణుడిని పూజిస్తున్నాం ఆభగవంతుడి దగ్గర తప్పు చేస్తే ఎంతటి వారైనా ఒక్కటే. కట్టుకున్న భార్యల్ని, కన్నకొడుకులని బంధువులనే వదలలేదు. మహానుభావులతో జాగ్రత్తగా లేకపోతె ఎవడు మిగలడు. భగవంతుడి దృష్టిలో అందరూ ఒక్కటే.. తప్పు చేస్తే ఫలితం అనుభవించాల్సిందే..
Jai Sri Ram..

గురుత్వాకర్షణ సిధ్ధాంతం అనేది ఎక్కడో ఒక ఆపిల్ పండు పడితేనే గానీ లేదా ఎవడో చెప్తేనే గానీ మనకు తెలియలేదు అనే అజ్ఞానపు మూర్ఖత్వం లాగానే
కర్మ సిధ్ధాంతం అనేది నేను నమ్ముతాను నేను నమ్మను నేను నమ్మనిది అసలు ఉండదు ఉండలేదు ఉండబోదు అని ఆలోచించే అజ్ఞాన మూర్ఖత్వానికి పరాకాష్ట
కనబడని ప్రాణవాయువు ద్వారా నీ గుండె గమనం అన్నది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎంత నిజమో ప్రాణం పోయాక ఏ ప్రాణ వాయువూ నీ గుండెని ఎలాగ కొట్టుకునేలా చేయలేదో అన్న విషయం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎంత నిజమో కర్మ సిధ్ధాంతం పై జరిగే R&D మనము నేర్చుకునే పాటించే ఈ కర్మాచరణ, కర్మ ఫల ప్రాప్తి, నిష్కామకర్మ, కర్మ నివృత్తి, కర్మ శేషమ్, క్రియా యోగం వంటివి అంతే నిజం.
జన్మకి కారణం కర్మ.
జన్మ మరణ చట్రానికి (Loop) కారణం కర్మ.
సుఖదుఖ కర్మాచరణలకు, జీవి యొక్క కర్మఫల భోగభాగ్యాలకు కారణం కర్మ.
కర్మ నిశ్శేషమే మోక్షం.
కర్మ లేదా కర్మ సిధ్ధాంతం అన్నవి అర్ధం చేసుకోవడం ఎంత సులభమో అంతే COMPLEX.
ఈ కర్మ జనితమైన జనన మరణ మాయా నిర్మితమైన పరమాత్మ సృష్టిని దాటడం కూడా ఎంత సులభమో అంతే COMPLEX.
కొన్ని కోట్ల జన్మల సంచిత కర్మ రాశి ఎంత ఉందో ఇంకా ఎన్ని కోట్ల జన్మల ఫలానుభవం మిగిలి ఉందో అర్ధం కావాలంటే ఈ చిన్న Trial చేసిన తెలుస్తుంది.
కళ్ళు మూసుకుని ఆలోచనా రహితంగా ఎలాగ ఉండలేమో ఆయా ఆలోచనలు మన కర్మరాశికి positive మరియూ negative balance add చేస్తూ జీవి అనుభవించాల్సిన కర్మరాశిని పెంచుతూ ఉన్నాయి. అలాంటిది ఇక మన మూర్ఖత్వంతో ప్రతీ రోజూ ప్రతీ క్షణం చేస్తూన్న కర్మ క్రియలను ఎలాగ గణిoచగలము.
భక్తి యోగం క్రియా యోగం జ్ఞాన యోగం కర్మ యోగం వంటి అనేక యోగాలలో ఏ ఒక్క దానిద్వారానైనా పరిపూర్ణత సాధించిన మోక్షప్రాప్తి సంప్రాప్తిస్తుంది.
*** --- *** --- ***
నిష్కామ కర్మ అన్నది ఎంతో జ్ఞానంతో గానీ పరిపక్వతతో గానీ అర్ధం కాదు ఆచరణకి అంతు బట్టదు. చేసే లేదా చేస్తున్న కర్మ ఫలప్రాప్తికి తన చిత్తం అంటకుండా చేసేదే నిష్కామకర్మ. కృష్ణార్పణం అనేది దానికీ ఒక simple solution. చేస్తున్న చేసిన కర్మ జీవునికి అంటకుండా చేసే ప్రక్రియ. కర్మ మరియూ కర్మ బంధనమే జీవునికి పునర్జన్మ హేతువు.
సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలు అని మూడు విధాలు.
సంచిత - ఎన్నో కోట్ల జన్మలలో చేసి పోగు చేసుకున్న కర్మ ఫలితం .
ప్రారబ్ధ - ఈ జన్మలో అనుభవించదగిన కర్మ ఫలితం.
ఆగామి - ఈ జన్మ కర్మ ఫలితం ద్వారా మిగిలే Total Balance Left Out.
NOTE: నిష్కామ, క్రియా యోగ తదితర పద్దతుల ద్వారా Zero out చేసుకోవచ్చు.
మన ఋషులు "ప్రారబ్ద కర్మ" ను మూడు విధాలుగా
విభజించారు .......
1. ధృతకర్మ 2. ధృతాధృత కర్మ 3. అధృత కర్మ అని.
పూర్వజన్మలో మన్నించడానికి ఏ మాత్రం
వీలులేని ఘోర తప్పిదం చేసినవాళ్ళు -
"ధృత కర్మ" విభాగంలోకి వస్తారు ....
ఒకరిని హత్యచేయటం, మోసం చేయటం వంటివన్నీ ఈ భాగంలోనే వస్తాయి.
వీళ్ళు ఆ తప్పుకు శిక్షను అనుభవింల్సిందే ఎంత శాంతి చేసినా ఏమి ఫలితం ఉండదు,
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ధృతాధృత కర్మ. అనగా క్రిందటి జన్మలో చేసిన తప్పు క్షమించబడటానికి వీలున్నది, అంటే బొంబాయికి టిక్కెట్టు కొనుక్కుని ప్రయాణీకుడు పొరపాటున ఢిల్లీ వెళ్ళే రైలు ఎక్కి, TCకి అది పొరపాటున జరిగినదని చెప్పటంతో అతను జరిగిన తప్పు ఒప్పుకొని ప్రయాణీకుడికి జరిమానా వేయకుండా వదిలి వేయటం .......
•••••••••••••••••••••••••••••••••••••••••••••••
ఇక మూడవది అధృత కర్మ. పూర్వజన్మలో చేసిన చాలా చిన్న పొరపాటు చేసినవ్యక్తికి సంప్రాప్తించేది, మనస్సులోకి ఏదో చిన్న చెడు తలంపు ప్రవేశిస్తుందే కానీ కార్య రూపంలోకి వెళ్ళదు. ఉదాహరణకి మీ ప్రక్కఇంట్లో మీకు నచ్చిన ఒక వస్తువు ఉందనుకోండి. దాన్ని "దొంగిలిస్తే" అనే ఆలోచన మీకు రావచ్చు కానీ మీరు దొంగిలించలేదు. ప్రక్క ఇంటికి వెళ్లారు ఆ వస్తువు మీద చెయ్యి కూడా వేయబోయారు, అంతలో ఎవరో రావటం కనిపెట్టి ఆ క్షణమే తప్పు గ్రహించి చెడు తలంపును ప్రక్కకు నెట్టే వారు. పూర్వజన్మలో మీరు తలబెట్టిన చిన్న తప్పుకి ఈ జన్మలో చిన్న శాంతిచేసి ఆ చెడు తలంపు వల్ల మిమ్మల్ని అంటిన ఆ పాపాన్ని కడుక్కోగల్గుతారు ........
````````````````````````````````````````````````````
కాబట్టి మొదటి విభాగంలోని వాళ్ళు తప్ప మిగిలిన రెండు విభాగాల్లోని వాళ్ళు శాంతి, గ్రహశాంతి చేయించటం వాళ్ళకు ఈ జన్మలో మేలు చేస్తుంది అంతే కాకుండా రాబోయే జన్మలో అది బ్యాంక్ బాలెన్స్గా మిగులుతుంది కూడా అందుకే జ్యోతిష్కులు శాంతి చేయించండని సలహాలిస్తుంటారు.
..... .........
కర్మ సిధ్ధాంతానికి స్వయానా పరమాత్మ కూడా లోబడి ఉంటాడు దాటలేరు అనే చిన్న ఉదాహరణ మనకోసం.
ఒకసారి శ్రీకృష్ణుడి కొడుకు సాంబుడు అతని స్నేహితులు ఆడుకుంటూ అటుగా వచ్చిన మహర్షులని చూసి ఆటప్పటిద్దాం అనుకున్నారు.
కడుపు వచ్చినట్లు నటించి మహర్షులు రాగానే "అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా" అని అడిగారు. నిజం గ్రహించిన మహర్షులు ఆగ్రహించి మీవంశాన్ని నిర్మూలించే ముసలం పుడుతుంది అని శపించి శ్రీకృష్ణుడిని దర్శించి వెళ్లిపోయారు..
సాంబుడు సహా ఇతర కుమారులంతా వచ్చి శ్రీకృష్ణుడి దగ్గర మొరపెట్టుకుంటే "అది మహర్షుల శాపం. దానికి తిరుగులేదు. నేను తిప్పలేను" మహాత్ములని అవమానించిన ఫలితం అనుభవించండి అని వదిలేశాడు.
కాలక్రమంలో వంశ నాశనం అయింది. మహాభారత యుద్ధం ముగిసింది. యాదవులు అహంకారంతో విర్రవీగుతున్నారు. తనమన బేధాలు మర్చిపోయారు. అది ఏ స్థాయికి వెళ్లిందంటే శ్రీకృష్ణుడి ఎదురుగానే తాగడం, మాంసాహారం తినడం , బూతులు మాట్లాడడం, శ్రీకృష్ణుడిని సైతం అవమానించేలా ప్రవర్తించడం చేశారు. అయన ముందే గొడవలు కొట్లాటలు అబ్బో ఇది అది అనికాదు. సకల దుర్గుణాల నిలయం అయ్యారు. ఒకరోజు యదవులందరూ అందరూ కలిసి విహారయాత్రకని వెళ్లారు సముద్రతీరానికి వెళ్లారు. తప్పతాగి మైకంలో ఒకరినొకరు దర్బలతో కొట్టుకొని చచ్చిపోయారు. అలా వంశనిర్మూలనం జరిగిపోయింది.
అనంతరం శ్రీకృష్ణుడు దేహం చాలించాడు. ద్వారకా నగరం కొద్దిసేపట్లో మునిగిపోతుందనగా అర్జునుడు మిగిలిన యాదవ స్త్రీలని శ్రీకృష్ణుడి భార్యల్ని తీసుకొని ఒడ్డుకి చేరుకున్నాడు. ద్వారకనగరం మునిగిపోయింది. ఇంతలో అక్కడికి అతి భయంకరులైన బోయలు కిరతులు వచ్చి కనిపించిన ఆడవాళ్ళని ఎత్తుకుపోయారు. కొందరిని చంపేశారు. శ్రీకృష్ణుడి భార్యల్ని సైతం వదలలేదు. ఎత్తుకుపోయారు. లక్షలాది శత్రువుని అవలీలగా జయించిన అర్జునుడు కిరాతులని ఏమి చేయలేక మిన్నకుండిపోయాడు. కళ్ళముందే ఎత్తుకుపోతుంటే నిష్చేష్టుడై పోయాడు..
కృష్ణుడిని పూజిస్తున్నాం ఆభగవంతుడి దగ్గర తప్పు చేస్తే ఎంతటి వారైనా ఒక్కటే. కట్టుకున్న భార్యల్ని, కన్నకొడుకులని బంధువులనే వదలలేదు. మహానుభావులతో జాగ్రత్తగా లేకపోతె ఎవడు మిగలడు. భగవంతుడి దృష్టిలో అందరూ ఒక్కటే.. తప్పు చేస్తే ఫలితం అనుభవించాల్సిందే..
Jai Sri Ram..

No comments:
Post a Comment